అన్నారం మాజీ సర్పంచ్ కు వీరేశం పరామర్శ
ప్రజా దీవెన/కట్టంగూర్: నకిరేకల్ నియోజకవర్గం కు చెందిన సీనియర్ బి అర్ ఎస్ పార్టీ నాయకులు నంద్యాల వెంకట్ రెడ్డి ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన వెంకట్ రెడ్డి ని ఆయన స్వగ్రామం కట్టాంగూర్ మండలం చెర్వు అన్నారం లోని ఇంటిలో కలిసి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు.
స్వల్ప అస్వస్థకు గురైనప్పటికి ఆరోగ్యం కుదుటపడేవరకు కొంత కాలం విరామం తీసుకోవాలని సూచించారు. వీరేశం వెంట కట్టంగూరు మాజీ zptc మాధ యాదగిరి, వెంకట్ రెడ్డి కూతుళ్ళు నిఖిలారెడ్డి, అఖిలా రెడ్డి, కుటుంబ సభ్యులు ఉన్నారు.