ప్రజా దీవెన, శాలిగౌరారం: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం శాలిలింగోటం గ్రామంలో బెల్ట్ షాప్ లను బంద్ చేయించాలని, మహిళా సంఘాల ప్రతినిధులు,గ్రామస్థులందరు ఏకగ్రీవంగా తీర్మానం చేసి శనివారం గ్రామ పంచాయితీ కార్యదర్శి వేమారెడ్డి కీ వినతిపత్రం అందజేశారు. ప్రతి రోజు గ్రామంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటలకు వరకు బెల్ట్ షాప్ లో పీకల దాక తాగి ఇంటికీ వచ్చి మహిళలను నానా దుర్భసలాడుతూ, వేదిస్తూ,కొడుతూ,మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు.తాగినవారు వీధుల్లో తిరుగుతూ అరాచకాలు చేస్తూ,మర్యాద లేకుండా మహిళలను కించ పరిచే విధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.ఇష్టంసారంగా రాత్రిబ oవళ్ళు తాగడం వల్ల పచ్చని సంసారాలు చెడిపోతున్నాయాన్నారు.
మద్యానికి బానిసైనా కొన్ని కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా చిన్నా భిన్నమవుతున్నాయని, తాగినవారు మానవత్వం కోల్పోయి జంతువుల్లా ప్రవర్తిస్తూ ఉండటం వల్ల గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుంతని అన్నారు ఎక్సైజ్, పోలీస్ అధికారులు స్పందించి గ్రామంలో బెల్ట్ షాపులు నడవకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.