ప్రజా దీవెన, శాలిగౌరారం: సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యా శాఖ లో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు సంఘం నాయకులు వేముల నాగయ్య డిమాండ్ చేశారు.సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టుతున్న రిలే నిరాహార దీక్షలు శాలిగౌరారం లో సోమవారం మూడవ రోజుకు చేరుకున్నాయి. శాలిగౌరారం ఎంపీడీఓ కార్యాలయం ముందు సోమవారం సమగ్ర శిక్ష ఉద్యోగుల జిల్లా నాయకులు నాగయ్య మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 10 వ తేదీన జిల్లా కలక్టర్ కార్యాలయం ను ముట్టడించి నిరవధిక సమ్మె చెప్పాడుతామని హెచ్చరించారు.
ఈ దీక్షకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా నిలిచి సంఘీభావం ప్రకటించారు.ఈ కార్యక్రమం లో సిహెచ్ బిక్ష్మయ్య, ఉయ్యాల లింగయ్య,సుజాత, బండారు పరమేష్,కొండ గీత,రేణుక నాగమణి, లలిత, లక్ష్మి,,నర్మద,శోభ,తదితరులు పాల్గొన్నారు.