— నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
Vemula Viresham: ప్రజా దీవెన, నకిరేకల్: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)సన్నధాన్యం సాగును ప్రోత్సహిస్తుందని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Viresham) పేర్కొన్నారు. సోమ వారం నకిరేకల్ పట్టణంలోని చీమల గడ్డ, మండలంలోని తాటికల్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను (Grain buying centres) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నధా న్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుందన్నారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. మధ్య దళారులను ఆశ్రయించవద్దని పేర్కొన్నారు. రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిం దన్నారు. కేంద్రాలలో ఎలాంటి అవకతవకలు జరిగినా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ నాగులంచ వెంకటేశ్వరరావు, తహసిల్దార్ జమీరుద్దీన్, ఎంపీడీఓ చంద్ర శేఖర్, మండల వ్యవసాయ అధికారి జానిమియా, పీఏసీఎస్ సీఈవో జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ చెవుగోని రజిత శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది నాగరాజు, సైదులు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం… రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం (State Govt) కృషి చేస్తుందని నకిరెకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల లో సోమవారం చిట్యాల, వెలిమినేడు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, ఎంపీడీఓ జయలక్ష్మి పీఏసీఎస్ చైర్మన్లు సుంకరి మల్లేష్ గౌడ్, ఏనుగు రఘుమారెడ్డి, వైస్ చైర్మెన్ బోంతల అంజిరెడ్డి, పీఏసీఎస్ సీఈఓలు బ్రహ్మాచారి, బొంతల రాజిరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మెన్ కాటం వెంకటేశం, పీఏసీఎస్ మాజీ చైర్మెన్లు పిశాటి భీష్మారెడ్డి, నర్రా మోహన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎద్దులపురి క్రిష్ణ, డీసీసీ కార్యదర్శి పోకల దేవదాసు పాల్గొన్నారు.