–ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి
Venkat Swamy: ప్రజా దీవెన, భువనగిరి: ఆరు గ్యారంటీలలో (Six guarantees)భాగంగా 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి చేసే ఆర్థిక సహకారం పరిమిత సంఖ్య లో అందడం కాకుండా ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం చేయాలని గ్రామాలు పట్టణాల్లో 30 శాతం వరకు ప్రజలకు నిలువ నీడ లేనం దున ప్రభుత్వ భూములను కానీ, భూమి కొనుగోలు పథకం ద్వారా కానీ, ఇంటి స్థలాలకు భూములను కేటాయించి, అందులో ఇల్లు లేని వారికి స్థలాలను ఇచ్చి 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం చేయాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం భువనగిరి పట్టణంలోని పెన్షనర్స్ బిల్డింగు(Pensioners Building) లో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పోరాట సమితి నాయకత్వ సమావే శం జరిగింది.
దీనికి వరికల్ గోపాల్ (Gopal) అధ్యక్షత వహించారు.ఈ సమా వేశంలో నూనె వెంకట్ స్వామి మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారు లు కబ్జా పెట్టడం, అసైన్డ్ భూముల తో సహా రియల్ ఎస్టేట్ వ్యాపా రాన్ని విస్తరించారు. హైదరాబాద్ నగర హైడ్రా ఆపరేషన్లలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను (Government lands, assigned lands) ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించిన వాటన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అందులో నిలువ నీడలేని నిరుపేదలకు ఇంటి స్థలాలను ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) 6 గ్యారెంటీలలో భాగంగా 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి మెజారిటీ ప్రజలకు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దానికోసం ప్రజలను సమయత్తం చేయగలమని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ సమావేశంలో ప్రజా పోరాట సమితి రాష్ట్ర, నాయ కులు జిల్లా నాయకులు సీసా శ్రీనివాస్ గౌడ్, మైలారం జంగయ్య, మైలారం సుదర్శన్, చల్ల వెంకట య్య ముదిరాజ్ గరిసె జంగయ్య, మలిగే లింగస్వామి, మాచర్ల నగేష్, వట్టిపల్లి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.