Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vice Chairman Manda Bheem Reddy : ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఎంపిక

— చైర్మన్ గా వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా మంద భీంరెడ్డి

–గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం.
–కమిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మె ల్యే

Vice Chairman Manda Bheem Reddy : ప్రజా దీవెన, హైదరాబా ద్: ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదే శాల మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షే మం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం చేయడానికి అడ్వ యిజరీ కమిటీని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వు లు జారీ చేశారు. గురువారం జి.ఓ. 57 విడుదల చేశారు. రెండేళ్ల కాల పరిమితి గల ఈ కమిటీ చైర్మన్ గా ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ అధికారి, అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా గ ల్ఫ్ వలసల నిపుణులు మంద భీం రెడ్డి లను నియమించారు. జిఎడి ప్రోటోకాల్, ఎన్నారై విభాగానికి చెం దిన జాయింట్ సెక్రెటరీ స్థాయి ఐఏ ఎస్ అధికారి కమిటీకి మెంబర్ సెక్రె టరీగా వ్యవహరిస్తారు.

కమిటీలో గౌరవ సభ్యులుగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నిజా మాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, రాష్ట్ర ఖనిజాభి వృద్ధి సంస్థ చైర్మన్, బాల్కొండ మా జీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ లను నియమించారు. గల్ఫ్ వలసలపై క్షే త్ర స్థాయిలో అవగాహన కలిగిన ప్రవాసీ కార్మిక నాయకులు  సింగిరె డ్డి నరేష్ రెడ్డి, డా. లిజీ జోసెఫ్, చె న్నమనేని శ్రీనివాస రావు, కొట్టాల సత్యంనారా గౌడ్, గుగ్గిల్ల రవిగౌడ్, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికి పండ్లలను కమిటీ సభ్యులుగా నియమించారు.

గత సంవత్సరం ఏప్రిల్ 16న ము ఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హైదరా బాద్ తాజ్ దక్కన్ లో గల్ఫ్ సంఘా ల ప్రతినిధులతో సమావేశమైన సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభు త్వం చర్యలు చేపట్టింది.

గల్ఫ్ తదితర గమ్యస్థాన దేశాల లోని అల్పాదాయ తెలంగాణ వల స కార్మికులకు ఆయా దేశాలలో లభిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్ర మాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. దేశంలోని కేరళ, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో గల్ఫ్ కార్మికులకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను ఈ కమి టీ అధ్యయనం చేస్తుంది. ప్రవాసీ కార్మికుల సమస్యలను అర్థం చేసు కోవడానికి, పరిష్కారాలను కనుగొ నడానికి ఈ కమిటీ గల్ఫ్ దేశాలను కూడా సందర్శిస్తుంది.

ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారం గా సమగ్ర ప్రవాస భారతీయుల విధానం (ఎన్నారై పాలసీ) రూపక ల్పన తో పాటు, తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ తదితర దేశా ల్లోని తెలంగాణ ప్రవాసీ కార్మికుల సంక్షేమ బోర్డు) ఏర్పాటు చేయడా నికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.