–విశ్వహిందూ పరిషత్ డిమాండ్
Vishwa Hindu Parishad : ప్రజాదీవెన నల్గొండ టౌన్ :పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు విశ్వహిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ పశ్చిమబెంగాల్ లో వక్ఫ్ బోర్డ్ చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లలో హిందువులను టార్గెట్ చేస్తూ హిందువు ఇళ్లల్లోకి జొరబడి వేట కొడవళ్ళతో మహిళలపై హత్యలు, అత్యాచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆస్తులను ధ్వంసం చేస్తూ హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నరని అయిన అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేసి వెంటనే రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నల్గొండ విభాగ కార్యదర్శి గంజి సుధాకర్, జిల్లా అధ్యక్షులు ఉమాకర్ రెడ్డి, జిల్లా సహ కార్యదర్శి జూకురి సంపత్ వర్మ, జిల్లా విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు రాయల కృష్ణయ్య, జిల్లా సంఘటన మంత్రి వంశీ, జిల్లా సేవా ప్రముఖు గోవర్ధన్, ధర్మప్రసాద్, జిల్లా ప్రముఖు కోటగిరి సంతోష్, ధర్మాచార్య సంపర్క ప్రముఖు ప్రకాష్, బజరంగ్దళ్ సంయోజక్ నరసింహ, జిల్లా సత్సంగ్ ప్రముఖు బల్లెం యాదిగిరి, నగర ఉపాధ్యక్షుడు వెంకటయ్య, నగర సహకార దర్శి విజయ్, కేతపల్లి మండల బజరంగ్దళ్ సంయోజకు పల్స రాజు, నగర సహ సంయోజక్ వెంకట్, నగర మట మందిర్ ప్రముఖు దీక్షిత్, తదితరులు పాల్గొన్నారు.