Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Visveswara Rao : పశుగణనకు సమగ్ర సమాచారం అందించండి

–పశుసంవర్ధక శాఖ సహాయ సం చాలకులు విశ్వేశ్వరరావు

Visveswara Rao : ప్రజా దీవెన, దేవరకొండ: దేశవ్యా ప్తంగా జరుగుతున్న 21వ అఖిల భారత పశుగణన లో భాగంగా ఇళ్ల వద్దకు వచ్చే విషయ సేకరణదారు లకు సమగ్ర సమాచారం అందించా లని జిల్లా పశు వైద్య శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బొడ్డు విశ్వేశ్వ రరావు సూచించారు.దేవరకొండ పశువైద్యశాల ఆవరణలో సోమ వారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తం గా 163 మంది ఎన్యుమరేటర్లు దాదాపు 50 మంది సూపర్వైజర్లు పశుగణనలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీతో పశుగణన పూర్తవు తున్నందున సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే గణన ఆధా రంగా పశుసంవర్ధక శాఖ మార్గద ర్శకాలు రూపొందించుకొని ముందుకెళుతుందని తెలిపారు.

 

 

ఈ సర్వేలో ఆయా రైతులకు చెం దిన అన్ని రకాల పశువులు గేదెలు మేకలు గొర్లు కుక్కలు పందులు కోళ్లు ఇతర పక్షుల వివరాలు సేకరిస్తారని తెలిపారు. పశుగణ నకు వచ్చే సిబ్బందికి తగిన సమాచారం ఇవ్వాలని రైతులను కోరారు. పశు గణన ద్వారా ఆయా ప్రభుత్వాలు బడ్జెట్లో కేటాయింపు పథకాల రూపకల్పన చేస్తాయని ఎంతో ముఖ్యమైన ఈ సర్వేను విజయవంతం చేసేందుకు రైతులు సమగ్ర సమాచారం ఇచ్చి తోడ్పాటు అందించాలని కోరారు
ఈ సమావేశంలో స్థానిక పశు వైద్యాధికారులు డా. నాగయ్య, ధనలక్ష్మి, రవి ,యమున, గుమ్మడవెల్లి శ్రీనివాస్ ,సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.