Vocational College :ప్రజాదీవెన నల్గొండ టౌన్ :నల్గొండలోని కేపీఎం ప్రభుత్వ ఒకేషనల్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపల్ గా డా. మేదరి షీబా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెను జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి దస్రునాయక్, ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు షీబాను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సీఈవో మారం గోనారెడ్డి, ప్రిన్సిపాళ్లు రాకెండ్ కుమార్, సుధారాణి, నరసింహ, ధనమ్మ, వెంకన్న, శిల్ప, మేరి, లక్ష్మి, సునిల్ రెడ్డి , విజయ్, రామస్వామి, యాదగిరి పాల్గొన్నారు.