Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vollyball Competation : ముగిసిన జిల్లా స్థాయి వాలీబాల్, క్యారం క్రీడా పోటీలు

Vollyball Competation  : ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం మండల కేంద్రంలోని జడ్పి స్కూల్ లో నేతాజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్, క్యారం క్రీడా పోటీలు గురువారం సాయంత్రం ముగిసాయి. వాలీబాల్ లో చిత్తలూరు గ్రామ జట్టుకు ప్రథమ బహుమతి ని మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు కల్లూరి నాగరాజు ప్రకటించిన 10 వేల నూటా పదహారు రూపాయల నగదును, షీల్డ్ ను అతని కుమారుడు కల్లూరి మణికంఠ అందజేశారు.రెండవ బహుమతి చిట్యాల, మూడవ బహుమతి అడ్లూర్,నాల్గవ బహుమతి శాలిగౌరారం జట్టులు,క్యారం లో.

 

మొదటి బహుమతి అడ్లూర్, ద్వితీయా బహుమతి శాలిగౌరారం గెలుచుకున్నాయి.ఈ బహుమతుల ప్రధాన కార్యక్రమం లో బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ జమ్ము రమేష్,జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వడ్లకొండ పరమేష్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు కల్లూరి లింగయ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షులు డెంకల సత్యనారాయణ,సుంచు ముత్యాలు,నేతాజీ యూత్ క్లబ్ ప్రతినిధులు బండారు మహేష్, నిమ్మల శంకర్, చిత్తలూరి రవి, కర్నాటి శంకర్, బండారు ధనుంజయ్య, చిత్తలూరి సాయి భార్గవ్,బండారు భరత్ తదితరులు పాల్గొన్నారు.