Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Waqf Amendment : వక్ఫ్ సవరణ బిల్లు 2024 ను వ్యతిరేకిస్తూ సీపీఎం నిరసన

Waqf Amendment : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : కేంద్ర ప్రభుత్వం మైనార్టీల హక్కులను భంగం కలిగిస్తూ పార్లమెంట్లో వక్ఫ్ సవరణ 2024 బిల్లును వ్యతిరేకిస్తూ నల్లగొండ ఈద్గా ప్రార్ధన స్థలం వద్ద నల్ల రిబ్బన్ ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం, జిల్లా కమిటీ సభ్యులు ఎండి. సలీం మాట్లాడుతూ ఈ సవరణ బిల్లు మతపరమైన హక్కులకు భంగం కలిగిస్తుందని వక్ఫ్ ఆస్తుల రక్షణకు విఘాతం కలిగిస్తుందని వక్ఫ్ స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు.వక్ఫ్ సవరణ బిల్లు 2024 ను 8 ఆగస్టు 2024 రోజున పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని దీనిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ సవరణ బిల్లు జాయింట్ పార్లమెంటు కమిటీకి పంపిందని అన్నారు. మొత్తం 31 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల అభిప్రాయాలు సేకరించింది. ఐదు కోట్ల మంది బిల్లులోని సవరణలు వ్యతిరేకిస్తూ జాయింట్ పార్లమెంట్ కమిటీకి వినతులు సమర్పించారని గుర్తు చేశారు. ఈ కమిటీ 421 పేజీల నివేదికను 13 ఫిబ్రవరి 2025 న లోక్ సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టింది. బిల్లుకు ప్రతిపాదించిన మొత్తం 44 సవరణలలో 14 సవరణలు స్వల్ప మార్పులు చేస్తూ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఆమోదించింది. ప్రతిపక్ష ఎంపీలు ఈ సవరణలు వ్యతిరేకిస్తూ ఇచ్చిన అసమతులను రిపోర్ట్ నుంచి తొలగించారని, ప్రతిపక్ష ఎంపీలు ఉభయ సభల్లో గట్టిగా నిలదీయడంతో అసమ్మతులను తిరిగి చేర్చారు.

 

ప్రస్తుతం జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుకు ఓటింగ్ కి రాబోతుందని అన్నారు. ఓటింగ్ లో ఈ బిల్లు నెగ్గితే రాష్ట్రపతి సంతకంతో ఇక చట్టంగా మారనుంది. స్వాతంత్రం తర్వాత 1954లో తొలిసారి వక్ఫ్ నియమ నిబంధనలు ఏర్పడ్డాయి. సంక్షేమ కార్యకలాపాల కోసం ఒక సంస్థకు ఇచ్చే బహుమతి లేదా దానం అని అర్థం. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తున్నది ఆస్తులను రక్షించడం కోసం కాదని, ఈ ఆస్తులను ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని కుట్ర అని విమర్శించారు. ఒక బోర్డ్ పరిధిలో ఉన్న లక్షల ఎకరాలపై కార్పొరేట్ల కు, శ్రామికవేత్తలకు కట్టబెట్టడం కోసం కుట్ర లో భాగమని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు ఊట్కూరి మధుసూదన్ రెడ్డి, ఎగ్బాల్ సాజిద్, మైనారిటీ నాయకులు అడ్వకేట్ నజీరుద్దీన్, కనగల్ మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ కౌన్సిలర్ ఇంతియాజ్, ఖలీల్, ఎగ్బాల్, అజీజ్, సోయబ్, అఖిల్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.