Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komati Reddy Venkat Reddy :ప్రజా ప్రభుత్వానికి సంక్షేమం,అభి వృద్ధి రెండుకళ్ళు

–మండల కేంద్రం నుండి జిల్లా కేం ద్రానికి హ్యామ్ రోడ్లు కీలకం
–అర్బన్,సెమీ అర్బన్, రూరల్ ఏరి యాలుగా రోడ్ల నిర్మాణానికి ప్రాధా న్యత
–ఆర్ అండ్ బి అధికారులు ఫీల్డ్ వి జిట్ చేస్తూ క్వాలిటీ చెక్ చేయాలి
–అధికారులు సీరియస్ గా రేయిం బవళ్ళు కష్టపడాలి
–NH 65 రోడ్డు పనుల పురోగతిలో వేగం పెంచాలి
–రోడ్లు భవనాలు శాఖ సమీక్షలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

Minister Komati Reddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం తో పాటు అభివృద్ధి కి సమపాళ్లలో ప్రాధాన్యతనిస్తున్నామని, అవి ప్రజా ప్రభుత్వానికి రెండు కళ్ళ లాం టివని రాష్ట్ర రోడ్లు భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవా రం నాడు ఆర్ అండ్ బి శాఖ అధి కారులు,NHAI అధికారులతో డా బి ఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ లో సుదీర్ఘంగా 5గంట ల పాటు సమీక్ష సమావేశం నిర్వ హించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూమండల కేంద్రం నుండి జిల్లా కేం ద్రానికి కనెక్టివిటీలో హ్యామ్ రోడ్లు కీ లకం కానున్నాయని తెలిపారు. అ ర్బన్,సెమీ అర్బన్, రూరల్ ఏరియా లుగా రోడ్ల నిర్మాణాన్ని ప్రాధాన్యత క్రమంలో చేపడతామని వెల్లడించా రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హ్యా మ్ రోడ్ల ప్యాకేజీల ఆమోదంతో త ర్వాత టెండర్ ప్రక్రియ వెంటనే ప్రా రంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్పెష ల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో రోడ్ ప్యాకేజీల వివరాలు చర్చించారు. NHAI నార్మ్స్ ప్రకారం పూర్తి స్థాయి లో నాణ్యత పాటిస్తూ హ్యామ్ రోడ్ల నిర్మాణం చేస్తామని,పదేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా క్వాలిటీ పాటించేలా వర్క్ ఏజెన్సీ లకు ముందుగానే తెలియజె ప్పాలని ఆర్ అండ్ బి అధికారు లతో అన్నారు.

ఆర్ అండ్ బి అధికారులు ఫీల్డ్ విజిట్ చేస్తూ క్వాలిటీ చెక్ చేయ డమే కాకుండా లో లెవెల్ బ్రిడ్జి,హై లెవల్ బ్రిడ్జ్ లాంటివి ముందే ఐడెం టిఫై చేసి భవిష్యత్ లో ప్రమాదాలు జరగకుండా..రవాణాకు అసౌకర్యం లేకుండా కన్సల్టెంట్ టీం లతో సంప్ర దించి ముందస్తు జాగ్రత్త చర్యలు చే పట్టాలని సూచించారు. హ్యామ్ వి ధానంలో ఆర్ అండ్ బి పరిధిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదా పు 50% రోడ్లు కవర్ అవుతాయ నీ,దీన్ని సిరియస్ గా తీసుకొని అధి కారులు రేయింబవళ్ళు కష్టపడాల న్నారు.

రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం ప నుల ప్రారంభంతో పాటు సదరన్ పార్ట్ ఆమోదం కోసం సిఎం తో కలి సి ప్రధాని మోదీ,కేంద్రమంత్రి గడ్క రీని త్వరలో కలుస్తామని చెప్పారు.
NH 65 రోడ్డు పనుల పురోగతి పై అధికారులను ఆరా తీసిన మంత్రి మదీనాగూడ నుండి సంగారెడ్డి వర కు 6లేన్ల రహాదారి విస్తరణ పనుల పురోగతిపై చర్చించి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.

టిమ్స్ హాస్పిటల్స్,వరంగల్ హాస్పి టల్,మెడికల్ కాలేజీలు, కలెక్టరేట్లు, పలు ఆర్వోబి లు నిర్మాణ చివరి దశలో ఉన్నవాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు.ఈ సమీక్ష సమావే శంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్,NHAI రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్,NH అధికారులు, ఆర్ అండ్ బి ఈఎన్సి జయ భారతి, సి. ఈ లు రాజేశ్వర్ రెడ్డి,మోహన్ నా యక్,ఎస్.ఈ ధర్మారెడ్డి, పలువురు ఆర్ అండ్ బి అధికారులు పాల్గొ న్నారు.