డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక,కరోనా కంటే 7 రెట్లు ఎక్కువ ప్రాణాంత కమైన అంటువ్యాధి
ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రపంచాన్ని మరో మహమ్మారి గడగడ లాడించేందుకు కాపు కాసుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పకనే చెబుతుంది. 1720లో ప్లేగు, 1817 లో కలరా, 1918లో స్పానిష్ ఫ్లూ, 2019లో కరోనా మహమ్మారి ప్రపం చాన్ని కుదిపేసింది. ప్రపం చంలోని ఏ దేశమూ ఈ మహమ్మారి నుంచి బయటపడలేదు. ఈ ప్రాణాంతక వ్యాధుల బారిన పడి లక్షల కోట్ల మంది ప్రాణాలు కోల్పో యారు. ఇప్పటికీ ఇలాంటి ప్రాణాంతక వ్యాధులపై డేంజర్ బెల్స్ ఆగ టం లేదు. ఇప్పుడు WHO భవిష్యత్తు లో మరో పేరులేని ప్రా ణాం తక వ్యా ధి ప్రజల్ని వెంటాడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.
ఈ భూమ్మీద ఏదై నా ఒక అంటువ్యాధి వచ్చినప్పుడల్లా అది ప్రపం చవ్యాప్తంగా వినా శకరమైన ప్రభావాన్ని చూపుతుంది. గత 400 ఏళ్ల చరిత్రను పరిశీ లిస్తే ఇదే ఈ విషయం వెల్లడైంది. 1720లో ప్లే గు, 1817లో కలరా, 1918లో స్పానిష్ ఫ్లూ, 2019లో కరోనా మ హమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రపంచంలోని ఏ దేశమూ ఈ మ హమ్మారి నుంచి బయటపడలేదు. ఈ ప్రాణాంతక వ్యాధుల బారిన పడి లక్షల కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు.
స్పానిష్ ఫ్లూని “మదర్ ఆఫ్ ఆల్ ఎపిడెమిక్స్”అని కూడా అంటారు. దీని కారణంగా 5 కోట్లకు పైగా మరణాలు సంభవించాయి. మొన్న టికీ మొన్న కరోనా వైరస్ కూడా అంతే ప్రాణాంతకంగా మారింది.. ఇది మిలియన్ల మంది ప్రజలను మృత్యుఒడిలోకి నెట్టింది. దాదాపు మొత్తం ప్రపంచాన్ని వణికించింది. అయినప్పటికీ, ఈ ప్రాణాంతక వ్యాధులపై డేంజర్ బెల్స్ ఆగటం లేదు. ఇప్పుడు WHO భవిష్య త్తులో మరో పేరులేని ప్రాణాంతక వ్యాధి ప్రజల్ని వెంటాడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.
‘X’ వ్యాధిగా చెబుతున్న ఈ వ్యాధిపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. దీన్ని నివారిం చేందుకు ప్రపంచం మొత్తం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ‘X’ వ్యాధి గురించి న భయంకరమైన విషయం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించింది. ఈ పేరులేని అంటువ్యాధి వైరస్, బ్యాక్టీరి యా, ఫంగస్ వంటి ఏ రూపంలోనైనా దాడి చేయగలదని WHO హెచ్చరిస్తోంది.
ఈ దాడి ఎవరిపై ఎక్కడ మొదలవుతుందో వైద్య శాస్త్రానికి కూడా తెలియదని ఆందోళన వ్యక్తం చేసింది. అందరూ ప్రజలంతా సరైన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని చెబుతు న్నారు. ఆధునిక ఆహారపు అలవా ట్లను తగ్గించి మేలైన పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని సూచిస్తున్నారు.
Whovirus