Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Woman’s Shamshabad..!శంషాబాద్‌లో మహిళ శవం..!

--మరో దిశ దారుణహత్యగా అనుమానం -- శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల స్థలాల మధ్య ఘటన

శంషాబాద్‌లో మహిళ శవం..!

–మరో దిశ దారుణహత్యగా అనుమానం

శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల స్థలాల మధ్య ఘటన

ప్రజా దీవెన/ రంగారెడ్డి: రాష్ట్రంలో దిశ సంఘటన మాదిరి మరో ఘోర సమాజం సిగ్గపడే సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని శంషాబాద్‌లో సంచలనం రేపిన దిశ మానభంగంతో కూడిన హత్య ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. నాటి హృదయ విదారక సంఘటన తరహాలోనే గురువారం రాత్రి మరో మహిళ దారుణ హత్యకు గురైంది.

సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల స్థలాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు మహిళను దారుణంగా హత్య చేసి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మృతదేహం స్థానికులకు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కాళ్లకు మెట్టెలు ఉండటంతో వివాహితగా గుర్తించారు. మహిళకు 35 – 36 ఏళ్ల వయస్సు ఉండొచ్చని సమాచారం.రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. శం

షాబాద్ లో సంచలనం రేపిన దిశ రేప్ అండ్ మర్డర్ తర్వాత ఇది రెండవ కేసు కావడం గమనార్హం. అసలు ఆ మహిళ ఎవరు ముందుగానే చంపేసి అక్కడకు తీసుకొచ్చి తగులబెట్టారా లేదంటే వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ దర్యాప్తులో సీసీ టీవీ ఫుటేజ్ కీలకం కానుంది.

ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలు ఈ కేసు విషయమై రంగంలోకి దిగాయి.