Y. Shekhar Reddy: ప్రజా దీవెన, శాలిగౌరారం: రైతులు తాము పండించిన ధాన్యాన్ని మధ్య దళారులకు విక్రయించకుం డా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజక్టు డైరక్టర్ వై. శేఖర్ రెడ్డి Y. Shekhar Reddy)అన్నారు. బుధవారం శాలిగౌరారం మండలం భైరవునిబండ, నూ లగడ్డ కొత్తపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీడీ శేఖర్ రెడ్డి (PD Sekhar Reddy) ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు .సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ (bonus) ఇస్తున్నట్లు తెలిపారు.కేంద్రాలలో గన్నీ బ్యాగుల,లారీల, హమాలీల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.రైతులు (farmers) తేమ లేని ధాన్యాన్ని మాత్రమే తీసుకరావాలని కోరారు.జిల్లాల్లో ఇప్పటికే 150 కి పైగా కేంద్రాలను ప్రారంభిచ్చినట్లు తెలిపారు.ధాన్యాన్ని మిల్లులో, మధ్య దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు.కొనుగోలు కేంద్రాలలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నటలయితే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని రైతులకు చెప్పారు.ఈ కార్యక్రమం లో డీపీఎం మోహన్ రెడ్డి,ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి,ఏపీఎం జానకి,మార్కెటింగ్ ఎస్ సి ఆర్ పి దాసరి శాంత, ఏ ఓ సౌమ్య శృతి, ఏపీవో జంగమ్మ,ఈసీ వెంకటాచారి,ఏఈవో వీరేష్,కాంగ్రెస్ నాయకులు దండ అశోక్ రెడ్డి, యాదగిరి రెడ్డి, నర్సిరెడ్డి,వెలుగు సిసి లు నోముల చంద్రయ్య, తాటిపాముల సైదులు, సంఘబంధం అధ్యక్షురాల్లు మోదుగు అండాలు, సంకటి సత్తమ్మ,రైతులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.