Yan. Ramachandra Rao : ప్రజా దీవెన,నల్గొండ: తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఊపందుకున్న తరుణంలో నల్గొండ – ఖమ్మం – వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాలయాన్ని నల్గొండ బిజేపీ జిల్లా కార్యాలయంలో బిజేపీ మాజీ ఎమ్మెల్సీ యన్. రామచంద్రరావు ప్రారంభోత్సవం చేశారు.
నూతన కార్యాలయంలో బీజేపి నాయకులు కార్యకర్తలు కలిసి ఘనంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు..
అనంతరం బిజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ యన్ రామచంద్ర రావు మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి మొదటి ప్రాధాన్యతల ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఓటర్లను కోరారు.సర్వోత్తమ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయడానికి వారు కృషి చేస్తారు అని తెలిపారు ప్రభుత్వం నుండి గత పది సంవత్సరాల ఉపాధ్యాయులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అన్యాయం చేసిందని ఆవేదన తెలిపారు.
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయడం కోసం ప్రభుత్వ పాఠశాలను రక్షించుకోవడానికి సర్వోత్తమ్ రెడ్డి అన్ని విధాలుగా కృషి చేస్తారని మాజీ ఎమ్మెల్యే రామచంద్రా తెలియజేశారు.అదేవిధంగా బిజెపి జిల్లా కార్యాలయంలో నాగం ముర్షిత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించుకున్నారు.నాగం వర్షిత్ రెడ్డిని శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ,బిజెపి రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి ,కాశం వెంకటేశ్వర్లు వీరేల్లి చంద్రశేఖర్,శ్రీ లత రెడ్డి ,పాలకూరి రవి గౌడ్ మరియు రాష్ట్ర జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.