–శాసనసభ్యుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Yennam Srinivas Reddy:ప్రజా దీవెన, మహబూబ్ నగర్: విద్యావంతుల సహకారం నేటి సమాజానికి అవసరం ఎంతైనా ఉంది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy)అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Zilla Parishad High School) లో కంప్యూటర్ ల్యాబ్ (Computer Lab) నిర్మాణదాత బి. వనమాల సన్మాన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వనమాలని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో ఉన్న పిల్లలు ఉన్నత శిఖరాలకు (Children are high peaks) చేరు కోవాలి అనే సదుద్దేశంతో తన భర్త స్వర్గీయ బుచ్చన్న గౌడ్ స్మారకార్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణం కోసం పది లక్షల రూపాయలను అందించి కంప్యూటర్ ల్యాబ్ గదిని నిర్మిం చడం అభినందనీయమని, ఇలాం టి వారు సమాజంలో చాలా అరు దుగా ఉంటారని ఆయన చెప్పారు.
ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలు ఉద్యోగులు, వ్యాపారులు (Employees and traders) కలిసి ప్రతి ఒక్కరూ తమతమ గ్రామంలో ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేసుకొం దామని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ భవిష్యత్తు నేటి పిల్లలే అని వారి భవిష్యత్తు బాగుంటేనే సమాజం బాగుంటుంది అని ఆయన స్పష్టం చేశారు. వేల కోట్ల రూపా యలు ఉన్న తృప్తి కంటే పది మంది బాగుకోసం చేసే మంచి తృప్తి అధిక మని ఆయన స్పష్టం చేశారు. మీరు ఎలాంటి మంచి పనులు చేస్తానంటే నేను అండగా ఉంటానని, రానున్న రోజుల్లో మహబూబ్ నగర్ ను ఎ డ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దేందు కు కృషి చేస్తానని ఆయన తెలిపా రు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మోతిలాల్, జిల్లా విద్యాశాఖాధికారి రవింధర్, ఎంఇఓ జయశ్రీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవిత, టి పిసిసి ప్రదాన కార్యదర్శి వినోద్ కుమార్, లక్ష్మణ్ యాదవ్, నాయ కులు అబ్దుల్ హక్, దేవేందర్, బుచ్చన్న గౌడ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.