ఎంపీపీ మల్లెల రాణి జడ్పిటిసి మందలపు కృష్ణకుమారి
ప్రజా దీవెన, కోదాడ: యోగ సాధన తో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఎంపీపీ మల్లెల రాణి జెడ్పిటిసి మందలపు కృష్ణకుమారి (MPP Mallela Rani ZPTC Mandalapu Krishnakumari) మదర్ తెరిసా స్కూల్ ప్రిన్సిపాల్ కనకదుర్గ ముత్తవరపు లక్ష్మి అన్నారు బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోదాడ (Kodada) పట్టణంలోని మహిళా మండలి అధ్యక్షురాలు (President of the Women’s Council) నూనె సులోచన ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం మహిళా మండలి లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రతిరోజు అందరూ ఉదయం ఒక గంట యోగాసనాలు చేసినట్లయితే అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉండడానికి యోగ దివ్య ఔషధం అన్నారు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంతో రోజంతా హ్యాపీగా ఉండొచ్చు అన్నారు.
అదేవిధంగా ఫ్రైడే గ్రీన్ డే సందర్భంగా మొక్కలకు నీరు పోసే కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమంలో కొత్తూరు విజయ మాతంగి శైలజ లక్ష్మి దేవి భారతి జ్యోతి ప్రమీల కృష్ణవేణి కొత్త విజయ తిరుపతమ్మ 29 వ వార్డు ఆఫీసర్ టి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు