
Blitzkrieg ACB Raids in Hyderabad : ప్రజా దీవెన, హై దరాబాద్:హైదరాబాద్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అ ధికారులు మరోసారి లంచగొండి వ్యవహారంపై కొరడా ఝు ళిపించారు. భవన నిర్మాణ అనుమతి ఫైల్ను ప్రాసెస్ చేసి, అనుమతి ఉత్తర్వులు, పని ప్రారంభ లేఖ అందించేందుకు రూ.20,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించిన GHMC టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
2026 ఆగస్టు 18న సంతోష్నగర్ సర్కిల్-25, చార్మినార్ జో న్ GHMC కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్న Ch. ప్రభావతి ఫిర్యాదుదారుని నుంచి రూ.20, 000 లంచం తీసుకున్నట్లు ACB అధికారులు తెలిపారు. ఆ మె వద్ద ఉన్న నగదును ఆమె సమక్షంలోనే స్వాధీనం చేసు కున్నారు.
అక్రమ లబ్ధి పొందేందుకు అధికారిక విధులను అనుచితం గా నిర్వహించినట్లు ఆరోపణలు నమోదు చేసిన అధికారు లు, నిందితురాలిని నాంపల్లిలోని SPE & ACB కేసుల I అ దనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట జ్యుడీషియల్ రిమాం డ్ కోసం హాజరుపరుస్తున్నారు. కేసుదర్యాప్తు కొనసాగుతోంది.
రూ.50 వేల లంచంతో ఇద్దరు ఫారెస్ట్ అధికారులు
ఇదే సమయంలో నాగర్కర్నూల్ జిల్లాలోనూ లంచం వ్యవ హారం ఏసీబీ దృష్టికి వచ్చింది. లింగాల ఫారెస్ట్ కార్యాలయా నికి చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీ రామ్ బాబు (AO-1), ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ మురళీ కృష్ణ (AO-2) పై క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదైంది.2026 జూలై 23న నల్లమల అటవీ ప్రాంతం నుంచి కలపను తరలిస్తున్న ఫిర్యాదుదా రుడు, ఇతరులను అధికారులు అడ్డుకున్నారని ACB తెలి పింది. లంచం చెల్లించకపోతే అటవీ చట్టం కింద కేసులు న మోదు చేస్తామని, ఎడ్ల బండ్లను స్వాధీనం చేసుకుంటామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మొదట రూ.1.20 లక్షలు డిమాండ్ చేసిన అధికారులు, అనంతరం ఆ మొత్తాన్ని రూ.50,000కు తగ్గించినట్లు ఏసీబీ వెల్లడించింది. దీంతో ఫిర్యాదుదారుడు రూ.28,000ను PhonePe ద్వారా, మరో రూ.22,000ను నగదు రూపంలో చెల్లించినట్లు తెలిపింది. అనంతరం అధికారిక రసీదు ఇవ్వ డానికి మరో రూ.6,000 డిమాండ్ చేసినట్లు ఆరోప ణలు నమోదయ్యాయి.ఈ వ్యవహారంలో నిందితులిద్దరినీ జ్యు డీషియల్ రిమాండ్ నిమిత్తం నాంపల్లిలోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
లంచం డిమాండ్ చేస్తే.. 1064కు ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు వెంటనే ACB టోల్ఫ్రీ నంబర్ **1064**కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. WhatsApp: **9440446106** ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే Facebookలో **Telangana ACB**, X/ట్విట్టర్ లో **@Telangana ACB** ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ బహిరంగ ప్రదే శాల్లో ACBను సంప్రదించేందుకు QR కోడ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫిర్యాదుదారులు, బా ధితుల పేర్లు మరియు వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.







