
Telangana High Court sensational comments : ప్రజా దీవెన, హైదరాబాద్: రా ష్ట్రంలో ఉచిత పథకాల అమ లు, ప్రజాధనం వినియోగంపై తెలంగాణ హైకోర్టు తీవ్రఆగ్ర హం వ్యక్తం చేసింది. ‘కల్యాణ లక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకా లపై గతంలో విధించిన స్టేను ఎత్తివేయడానికి న్యాయస్థానం స్పష్టంగా నిరాక రించింది. ఖజానాపై పడుతున్న మితిమీరి న భారంపై అత్యున్నత న్యా యస్థానం చేసిన వ్యాఖ్యలు ఇ ప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చ ర్చనీయాంశంగా మారాయి. రా ష్ట్ర ఆర్థికస్థితి ప్రమాదకర స్థాయికి చేరుకుందని, ప్రస్తుత పరిస్థితు లు భవిష్యత్తుకు తీవ్ర హెచ్చరికలని కోర్టు స్పష్టం చేసింది.
జీతాలు, పెన్షన్ల సంక్షోభం
ఒకవైపు ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్ష న్లు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందు లు పడుతుంటే, మరో వైపు ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఉచితాల కు మళ్లించడం ఎంతవరకు స మంజసమని ప్రశ్నించింది. సామాన్య ప్రజలు కట్టే పన్నులతో స మకూరే ఆదాయాన్ని 2014 నుంచి ఇ లాంటి ఉచిత పథకాలకు కేటాయిస్తూ ప్రజాధనాన్ని వృథా చేయడం న్యాయమేనా అని నిలదిసింది.ఈ పరిణామంతో సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర ప్రభు త్వ ఆర్థిక నిర్వహణ విధానాలపై న్యాయవ్యవస్థ గట్టి నిఘా ఉంచినట్లయింది. భ విష్యత్తులో ఉచి త పథకాలకు, ప్రాథమిక ఆర్థిక బాధ్యతల కు మధ్య ప్రభుత్వం ఎలాంటి సమతుల్యత పాటి స్తుందనేది ఆసక్తికరంగా మారింది.




